JSON Variables

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై మామిడి మహేందర్

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై మామిడి మహేందర్
న్యూస్ పవర్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట :
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు యువకులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సె మామిడి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ డీజే లు గాని సౌండ్ సిస్టం గాని నిర్వహించరాదని. రోడ్లపై వేడుకలను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వరుసగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments