JSON Variables

దేశ చట్ట సభల భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి


దేశ చట్ట సభల భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి

న్యూస్ పవర్ , 16 డిసెంబర్ , ఇల్లంతకుంట:
 తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా"బి. ఆర్. అంబేద్కర్ పెట్టి అదేవిదంగా ఢిల్లీ లో నిర్మిస్తున్న నూతన అత్యున్నత పార్లమెంట్ భవనానికి డా"బి. ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ...ఈ శీతాకాల సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనానికి డా" బాబా సాహెబ్ బి. ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఇల్లంతకుంట మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం ముందు ఈ నెల 14 నుండి మూడు రోజుల పాటు సామాజిక ఉద్యమ కారుడు సావనపెల్లి రాకేష్ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది 3 రోజు ల నిరాహార దీక్ష విజయవంతం చేసుకొని ఈ రోజు విరమణ చేసి సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.
.ఈ శీతాకాల సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి, కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా కొనసాగుతున్న బండి సంజయ్  పార్లమెంట్ సమావేశంలో పార్లమెంట్ భవనానికి  అంబేద్కర్ పేరు నామకరణం చేయుటకు చర్చించాలి ఒప్పించాలని డిమాండ్ చేస్తూ.. లేని యెడల బీజేపీ ఎంపీ లను, ఎమ్మెల్యే నాయకులు ను తెలంగాణ ఎక్కడ తిరిగిన అడ్డుకుంటామని హెచ్చరిస్తూ తెలంగాణ వ్యాప్తంగా దీక్ష లు నిరసన కార్యక్రమాలు ప్రజా సంఘాల, అంబేద్కర్ సంఘాల, దళిత సంఘాల ను అన్ని కుల సంఘాల ను కలుపుకొని పెద్ద ఎత్తున చేపడుతామణి హెచ్చరించారు...
   ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నారం నర్సయ్య, శ్రీ రామ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇమ్రాన్, ప్రజా సంఘాల & అంబేద్కర్ సంఘాల నాయకులు ఎర్ర బాలకిషన్,కాసుపాక రాములు,గరిగే రవి, సావనపెల్లి రాములు, కొట్టెపెల్లి రామచంద్రం, మచ్చ రమేష్, మామిడి ఎల్లం,సావనపెల్లి శంకర్,గంగం అనిల్,పండుగ రవి,గడ్డం తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments