JSON Variables

ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం

ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం

 న్యూస్ పవర్ , 27 అక్టోబర్ , ఇల్లంతకుంట :
 రోజు ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి  ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోడి దిష్టి బొమ్మ దహనం చేసినారు,అనంతరం ఎంపీపీ వూట్కూరి వెంకట రమణా రెడ్డి మరియు పల్లె నర్సింరెడ్డి  మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అంటూ నీతి సూత్రాలు వల్లే వేసే భారతీయ జనతా పార్టీ,తెలంగాణ ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకరిజం చేయడం సిగ్గుచేటని అన్నారు,
తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక బిజెపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తున్నామని అన్నారు,
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమంగా మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు,
బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు.ఇక నైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలి అన్నారు,
ఈ కార్యక్రమంలో వారితో పాటు  సర్పంచ్ లు కూనబోయిన బాగ్యలక్ష్మి బాల్ రాజు,ఎలుక లక్ష్మి స్వామి,కట్ట వెంకట్ రెడ్డి, తిరుపతి రెడ్డి,మార్కెట్ కమిటి డైరెక్టర్ లు మాంకాలి బాబు ,యార దేవేందర్,యూత్ మండల అధ్యక్షుడు , బుర్ర సూర్య గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు పెద్ది రాజు నాయకులు ,ప్రదీప్ రెడ్డి ,ఎలుక రాజయ్య, కూనబోయిన రఘు,తెలంగాణ శ్రీనివాస్, ప్రవీణ్, మహేష్, సమీర్, నాగరాజు, మనిదీప్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments