JSON Variables

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గర్భిణులకు, పేషెంట్లకు అన్నదానం

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గర్భిణులకు, పేషెంట్లకు అన్నదానం

బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం
బెల్లంపల్లి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిర్వహణ
జాతీయ నేతల అడుగుజాడల్లో నడుద్దామని పిలుపు

బెల్లంపల్లి: జాతీయ నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం గర్భిణులకు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు  దాత బండి రాంచేందర్ ఎనగందుల దత్తు గారి సహకారం తో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలను కొనియాడారు. దేశ నాయకుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి మంగళవారం సాయి భోజన్
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన గర్భిణులు మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగ్ నిమిత్తం వచ్చారు. వీరికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది కాకుండా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.  గర్భిణీలకు,పెషేంట్లకు స్థానిక నూతన ఆసుపత్రి భవన నిర్మాణ కూలీలకు అన్నదానం చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి మంగళవారం గర్భిణులకు రోగులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి  శంకర్ రాజేశ్వరి తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. 
సాయం చేయాలనుకుంటే సంప్రదించండి
ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ  ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తి పరుస్తున్నామని  తెలిపారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,కోశాధికారి జక్కం నాగమణి మోట పలుకుల తిరుపతి కొడిమాల సంతోష్ దుర్గం మారుతీ అంబాల ప్రేమ్, డి మధు  సభ్యులు, సేవకులు, దాడి సురేష్  E భాస్కర్ A భారతి త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.సంప్రదించడానికి 8106550532

Post a Comment

0 Comments