JSON Variables

గ్రామ పంచాయతీ ఆవరణంలో చలివేంద్రం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నాగేశ్వరి శ్రీకాంత్

గ్రామ పంచాయతీ ఆవరణంలో చలివేంద్రం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నాగేశ్వరి శ్రీకాంత్ 
న్యూస్ పవర్ రిపోర్టర్
రేవొజురాజా బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ పాము నాగేశ్వరి  - శ్రీకాంత్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించాము. ఎండ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రాగలరు. ఒకవేళ వచ్చినా తలకు ఏదైనా టవల్ లేదా టోపీ గాని ధరించాలి .అని తెలిపారు. అలాగే ఎంపిటిసి  కొనెశేఖర్ మాట్లాడుతూ ఎండ ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త ఉండాలి.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తడిసిన నారాయణరెడ్డి వార్డు సభ్యులు ఎర్రవెల్లి సరూప -దాసు. ద్యాగాల అనురాధ- శేఖరు. ఏఎంసి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్. పిల్లి కనకయ్య. చుక్క సురేష్. పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments