JSON Variables

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు అన్నదానం

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు అన్నదానం
బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం
బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సభ్యుల సహకారంతో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ప్రతి మంగళవారం బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణులకు, రోగులకు, నూతన ఆసుపత్రి భవన నిర్మాణ రంగ కార్మికులకు అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, స్థానిక కార్మికులు, గర్భిణీలు అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సాయం అందించాలని ఉంటే సంప్రదించండి
ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు సాగాల సదానందం బండారి శ్రీనివాస్ మోటపలుకుల తిరుపతి, సంతోష్, దుర్గం మారుతీ సేవకులు భాస్కర్ ఉషశ్రీ, శివరాం,ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు పాల్గొన్నారు. బాయిజమ్మ ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Post a Comment

0 Comments