JSON Variables

పూలే జయంతి సందర్భంగా బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదానం

పూలే జయంతి సందర్భంగా బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదానం
బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్

బెల్లంపల్లి: బహుజనుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్  ద్వారా సభ్యుల సహకారంతో సోమవారం ఆహార పంపిణీ చేపట్టినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు పేదవారికి మరియు అన్నార్తులకు అన్నం పొట్లాలను పంచినట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు పాల్గొన్నారు. బాయిజమ్మ ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Post a Comment

0 Comments