JSON Variables

భూ సమస్య పరిష్కరించాలని వినతి

**


 భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు వినతి
భీమిని, మార్చి 16 : బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో భీమిని మండలంలోని చిన్నతిమ్మాపూర్ గ్రామ పరిధిలోని తంగలపల్లి గ్రామంలో భూ సమస్యను పరిష్కరించాలని బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సిర్పూర్ ఎమ్మెల్యే కొనప్ప, సర్పంచ్ ఇందూరి భూమయ్య లు హైదరాబాద్ లోని భూ పరిపాలన  కమిషనర్ శేషాద్రి కి వినతిపత్రం అందించారు.  గ్రామంలో మొత్తం 600 ఎకరాల భూమి ఉండగా సర్వే నంబర్ 1 నుండి 59 వరకు ధరణి పోర్టల్ లో నిషేధిత భూమిగా చూపించారు. దీని కారణంగా మొత్తం 600 ఎకరాల భూమి కి అర్హులైన రైతులకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వడం లేదని, దీని వల్ల రైతులు ప్రభుత్వ ప్రయోజనలైన రైతు బంధు, తదితర పథకాలు రైతులు కోల్పోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. గ్రామ రైతులకు న్యాయం చేస్తానని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బెల్లంపల్లి, సిర్పూర్ ఎమ్మెల్యేలు చిన్నయ్య, కొనప్ప, సర్పంచ్ భూమయ్య, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్ గుప్తా, టి ఆర్ ఎస్ నాయకుడు సుదర్శన్ గౌడ్, గ్రామస్తులు ఇందూరి గోపాల్, శ్రీను తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments