JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు అన్నదానం



న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

- బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ
- స్కానింగ్, చెకప్ లకు వచ్చే వారికి కడుపు నింపే కార్యక్రమం
- ప్రతి మంగళవారం అందుబాటులో అన్నదాన సేవలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన గర్భిణులు మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగ్ నిమిత్తం రాగా వారికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి దుర్గం శంకర్ దుర్గం తిరుపతి, ఆకుల శ్రీకాంత్, రాంబాట్ల హరీష్ శర్మ తల్లూరి సురేష్ గార్ల సహకారముతో అన్నదానం చేపట్టారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతి మంగళవారం చుట్టుపక్కల మండలాల నుంచి గర్భిణులు స్కానింగ్ మరియు వివిధ చెకప్ ల నిమిత్తం వస్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు కూడా చాలామంది గర్భిణులు రోగులు వచ్చారు. వారికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది కాకుండా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ప్రతి మంగళవారం అన్నదాన సేవ
బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రతి మంగళవారం గర్భిణులకు రోగులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. కాగా, తమ కడుపు నింపిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందం వ్యక్తం చేశారు.
సాయం అందిద్దాం
బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తి పరుస్తున్నామని పేర్కొన్నారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు నల్ల శ్రీనివాస్ మోటపలుకుల తిరుపతి, జక్కం నాగమణి దుర్గం మారుతీ ప్రేమ్, మధు కొడిమాల సంతోష్ , సేవకులు బొల్లెద్దుల మహేశ్వర్ రెడ్డి,సీనియర్ న్యాయవాది ఠాకూర్ గోపికిషన్ సింగ్,కుడిపుడి కొండబాబు,డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.సంప్రదించడానికి.8106550532

Post a Comment

0 Comments