JSON Variables

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

బెల్లంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కోయ్యల ఏమాజీ డిమాండ్,:
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని బిజెపి బెల్లంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కొయ్యాల ఏమాజీ అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్ ఈటల రాజేందర్ రఘునందన్ రావు లపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాడటానికి అసెంబ్లీ సమావేశాల్లో టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతారనే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతల వ్యవహరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశంలో పాల్గొనకుండా సస్పెండ్ చేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర గవర్నర్ ప్రసంగం లేకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమాన పరచాలని అన్నారు. ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మను బెల్లంపల్లి పట్టణంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,st మోర్చ జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్రీనివాస్,భిమిని మండల అధ్యక్షులు రామన్న యాదవ్,సంగీత,నాయకులు కేశవరెడ్డి,రాజులాల్ యాదవ్, పోన్నకాయల నాగరాజు,శ్రావణ్,ప్రకాష్,నర్సింగ్,నవీన్,కుమార్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments