JSON Variables

గర్భిణులకు అన్నదానం

గర్భిణులకు అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

- బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ
- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం

బెల్లంపల్లి కెమికల్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో మంగళవారం స్కానింగ్ మరియు చెకప్ లకు వచ్చిన గర్భిణులకు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారు అన్నదానం చేశారు.  బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన గర్భిణులు మంగళవారం  బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్కానింగ్ నిమిత్తం వచ్చారు. వీరికి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది కాకుండా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.  గర్భిణీలు రోగులు స్థానిక భవన నిర్మాణ కూలీలకు కొడిప్యాక రంజిత్, సీనియర్ న్యాయవాది ఠాకూర్ గోపికిషన్ సింగ్,యేనగందుల దత్తు దుర్గం భానుప్రియ, మేడ తిరుపతి రెడ్డి, ఇట్యాల దుర్గం శంకర్ బండారి అన్వేష్ గార్ల సహకారంతో అన్నదానం చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి మంగళవారం గర్భిణులకు రోగులకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి  శంకర్ రాజేశ్వరి తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ  ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తి పరుస్తున్నామని  తెలిపారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,కోశాధికారి జక్కం నాగమణి సభ్యులు మోటపలుకుల తిరుపతి దుర్గం మారుతీ ఉషశ్రీ , శివరామ్ సేవకులు భాస్కర్ త్రయాక్షర్, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments