JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆహార పంపిణీ


న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా తాండూర్ మండలం తంగళ్ళపల్లి వాస్తవ్యులు MM జిరాక్స్ సెంటర్  శ్రీ పగిడి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో గురువారం సందర్భంగా సాయిబాబా వారి పేరు మీదుగా రాత్రి బెల్లంపల్లిలో అన్న ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్న ప్రసాదం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు మరియు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments