JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

- బెల్లంపల్లి ఫ్లైఓవర్ పంచముఖ శివాంజనేయ విగ్రహం వద్ద ఏర్పాటు
- బాటసారులకు ప్రయాణికులకు తాగేందుకు చల్లని నీరు సదుపాయం 
- వరుసగా మూడవ ఏడాది తాగునీటి సేవా కార్యక్రమం
బెల్లంపల్లి: బెల్లంపల్లి కన్నాల ఫ్లైఓవర్ పంచముఖ శివాంజనేయ విగ్రహం వద్ద బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో వరుసగా మూడవ ఏడాది కూడా ఉచిత చల్లటి తాగునీరు పంపిణీ  కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి,తెలిపారు. ఇటు మంచిర్యాల వైపు, అటు ఆసిఫాబాద్ వైపు, మధ్యలో బెల్లంపల్లి పట్టణంలోకి వెళ్ళు మూడు దారుల చౌరస్తాలో ప్రయాణికులు మరియు బాటసారులకు ఎండాకాలం నేపథ్యంలో దప్పిక తీర్చేందుకు గాను ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం అన్నదాన సేవ
బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రతి మంగళవారం గర్భిణులకు పెషేంట్లకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. అందరికీ కడుపు నింపే తల్లుల కడుపు నింపేందుకు తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు వారు చెప్పారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార మరియు తాగునీటి పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వ్యవస్థాపకులు తెలిపారు.సాయం అందించాలనుకొంటే సంప్రదించండి.బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఆకలితో ఉన్న వారిని అతిధి సత్కారంతో ఆదరించి అన్నదానం తో తృప్తి పరుస్తున్నామని పేర్కొన్నారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు బండారి శ్రీనివాస్, సాగల సదానందం, డి. మధుకర్, అంబాల ప్రేమ్ కుమార్ వేముర్ల కిరణ్ కుమార్ దుర్గం మారుతీ కొండగొర్ల అశోక్  , సేవకులు HMTV వెంకటేష్ , అర్చకులు అయ్యగారు పడిగెల వేణుగోపాల్ శర్మ పాల్గొన్నారు.సంప్రదించడానికి మేనేజర్ 8106550532

Post a Comment

0 Comments