JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పుల్వామ ఘటన అమర జావానుల జ్ఞాపకార్ధముగా అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పుల్వామ ఘటన అమర జావానుల జ్ఞాపకార్ధముగా అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా  పూల్వమా ఘటన అమర జవానుల జ్ఞాపకార్ధముగా సోమవారం మధ్యాహ్నం బెల్లంపల్లి లో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు మరియు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments