JSON Variables

ప్రతాపరుద్ర సింగరాయ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న - భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు




సిద్దిపేట జిల్లా: ఫిబ్రవరి01,( కోహెడ మండలం) / కూరేళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రకృతి అందల్లో ఎత్తైన కొండ గుహల్లో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ ప్రతాప రుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈరోజు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవించాలని ,మన హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వంగర గ్రామంలో జన్మించి దేశానికి ప్రధాన మంత్రి గా పని చేసి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మహనీయుడు నూతన ఆర్దిక సంస్కరణల పితామహుడు స్థితప్రజ్ఞ పీవీ నరసింహారావు కి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కూరేళ్ల గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ ,ఎంపిటిసి జాగిరి కుమార స్వామి,జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధులు వలస సుభాష్ చంద్రబోస్ నేత,గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు వివిధ రాష్ట్రాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments