JSON Variables

టిఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం విడ్డూరం

వరి వేయక బాధ పడుతున్న రైతులు .
  పసుల తిరుపతి. రిపోర్టర్ న్యూస్ పవర్ . జనవరి.04/22    
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని రైతులు వరి వేయలేక బాధపడుతుంటే మరోవైపు టిఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య ఆరోపించారు మండలంలోని సింగసముద్రం చెరువులు వాగులు నీటితో సమృద్ధిగా కళకళలాడుతూ ఉంటే ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయమని వడ్లను అమ్ముకునే బాధ్యత రైతులది అని  ప్రభుత్వం ప్రకటించే సరికి రైతులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి రైతులు విరివిగా వరి పంట పండు ఇస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపి కొని చివరికి రైతుల వడ్లు కొనమని చెప్పడం దారుణమన్నారు  వరి వేసిన తర్వాత వడ్ల కొనుగోలు చేయకపోతే అప్పటి పరిస్థితి ఏమిటని రైతులు దీర్ఘాలోచన చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి వరి సాగుకు రైతులకు సంకేతాలు ఇవ్వాలన్నారు రైతులు బాధపడుతుంటే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు

Post a Comment

0 Comments