JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం


న్యూస్ పవర్ బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా దేవాపూర్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ గోపికమ్మథమ్మాజీ గార్ల సహకారంతో  గురువారం సందర్భంగా సాయిబాబా వారి పేరు మీదుగా సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments