JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం   

బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సాన వెంకటయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు 2వ వర్ధంతి  సందర్భంగా వారి కూతుర్లు అల్లుళ్లు , తోట వనజ రాజేశ్వర్ రావు,జాపతి జలజ వెంకటేశ్వర్లు,కారెంగుల శైలజ మోహన్, జాపతి అన్విత కుటుంబీకుల వారి ఆర్ధిక సహకారంతో శుక్రవారం  మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, యాచకులకు అన్నదానం చేయడం జరిగిందని వివరించారు. అన్నదానాన్ని  స్వీకరించిన వారు ఈ సందర్భంగా వెంకటయ్య కుటుంబ  సభ్యులకు , మరియు బాయిజమ్మసాయి సేవ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే మాలాంటి వారికి ఈ అన్నదానం కార్యక్రమం కడుపు నింపి ఎంతగానో ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ఉంటే బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం మరియు సేవా కార్యక్రమాలు చేయవచ్చునని ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దామని, అన్నదానంతో తృప్తి పరుద్దామని ఈ సందర్భంగా ట్రస్ట్ వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,ట్రస్ట్ సభ్యులు మోటపలుకుల తిరుపతి, కొడిమాల సంతోష్, దుర్గం మారుతీ, చెంద్రపెల్లి క్రిష్ణ, జక్కం ఉషశ్రీ, జక్కం శివరామ్, కొమ్ము లక్ష్మి మరియు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments