న్యూస్ పవర్:- జిల్లా నల్గొండ మండలం కొండ మల్లేపల్లి గ్రామం చింతకుంట్ల లోని యువజన సంఘాల వినతి మేరకు చింతకుంట్ల గ్రామంలోని గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు, కుర్చీలు, టేబుల్స్ ,కంప్యూటర్ , అలుమార్లు మరియు గ్రంథాలయ సిబ్బందిని తమ సొంత ఖర్చులతో సమకూర్చిన దాత దూదిపాల శ్రీధర్ రెడ్డి ముందుకు వచ్చి సమకూర్చారని గ్రామ యువత తెలిపారు. నేడు గ్రంథాలయాన్ని కొండమల్లేపల్లి మండల ఎంపీపీ రేఖ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఎంపీపీ రేఖ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం గ్రామంలో నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం గ్రామంలోని యువతకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. అనంతరం దాత దూదిపాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయానికి కావలసిన ఇంకా ఇతర అవసరాలను ప్రతిదీ తీర్చడానికి నేను ముందుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి యేకుల సురేష్ , పంచాయతీ కార్యదర్శి కిరణ్ ,
హైస్కూల్ చైర్మన్ ముచ్చెర్ల అంజయ్య , కోఆప్షన్ సభ్యులు వెంకటమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది నగేష్, గ్రామ యువజన సభ్యులు బెజవాడ అంజనేయులు పాల్గొన్నారు.
0 Comments