పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బెజ్జంకి రిపోర్టర్ ( వెబ్ న్యూస్ )పంతంగి ప్రవీణ్ కుమార్
బెజ్జంకి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-1998 సంవత్సరంలో చదివి 10వ తరగతి పూర్తి చేసుకొని 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న , శుభ సందర్భంగా ఆనాటి మధురమైన జ్ఞాపకాలను మదిలో తలచుకుంటూ ఆ నాటి ఉపాధ్యాయులను సన్మానించి వారి యొక్క విలువైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. చిన్ననాటి మిత్రులు అందరూ సత్యార్జున గార్డెన్ బెజ్జంకి లో, 23 సంవత్సరాల అనంతరం కలవడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వక్తం చేసారు. మున్ముందు మిత్రులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులో ఉన్న ఆర్థికంగా మానసికంగా ఆదుకోవాలని నిర్ణయం తిసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,శ్రీనివాస్,శరధృతి,నాగయ్య ,సుదర్శన్ రెడ్డి,మిత్ర బృందం పాల్గోన్నారు.
0 Comments