బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్. న్యూస్ పవర్ . జనవరి.06/22:రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి?*....ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పద్మారెడ్డి కి మరియు అతడి కొడుకు శ్రీనివాస్ రెడ్డి కి మధ్య ఆస్తితగాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అక్కడి సంఘ సభ్యులు అప్పట్లో పంచాయతీ నిర్వహించారు. చివరకు ఎటు తేలకపోయింది. దీంతో తాటిపల్లి పద్మారెడ్డితో ఎవరు కులసంఘ సభ్యులు మాట్లాడకూడదని సంఘ సభ్యులు తీర్మానం చేసుకున్నట్లు తెలిసింది.అతడికి ప్రతి నిత్యం పాలు పొసే వారు కూడా పాలు పోయలేదని,తెలిసింది.తనను కుల బహిష్కరణ చేశారని పద్మా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. చివరకు తండ్రి కొడుకుల మధ్య గల ఆస్తితగాదాలు పెద్దమనుషుల సమక్షంలో ఒక కొలిక్కి వచ్చాయి.అయిన పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడడం లేదు.కులసంఘము లో కలుపుకోలేరు.కాగా నిన్న అట్టి సంఘ సమావేశం కాగా తాటిపల్లి పద్మారెడ్డి తో ఎవరు మాట్లాడకూడదని చెప్పినాము కదా ఎందుకు మాట్లాడినారు అని అట్టి సంఘం లో ఉన్న కుంబాల రాజిరెడ్డికి 10 వేల రూపాయలు జరిమానా విధించారు.అట్టి డబ్బులు సదరు సంఘానికి రాజిరెడ్డి చెల్లించాడని తెలిసింది.అదే విదంగా పద్మారెడ్డి సమీప బంధువు తాటిపల్లి శంకర్ రెడ్డి కి సైతం 10 వేల రూపాయల జరిమాన విధించగా అట్టి డబ్బులు శంకర్ రెడ్డి చెల్లించనట్టు తెలిసింది.ఇట్టి సంఘటన సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది .దీని పై పోలీసులు ఏ విదంగా స్పందిస్తారో చూడాలి మరి.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...
Comments
Post a Comment