JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్: సాయిరాం
మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా తాండూరు వాస్తవ్యులు శ్రీ వేణుగోపాల్ రావు గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో స్వతంత్ర భారతదేశ వీరుడు ఆంగ్లేయులతో పోరాడిన సమరయోధుడు అయిన ఉద్దమ్ సింగ్  జయంతి సందర్భంగా వారి సహకారంతో  ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ ఆ వీరుడిని మన బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ గుర్తుచేసినందుకు వేణుగోపాల్ సర్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments