బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం
మంచిర్యాల జిల్లా// బెల్లంపల్లి పట్టణంలో కాల్ టెక్స్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ రాం కమల సత్యనారాయణ గారు కరోనా కాలంలో ఎటువంటి ప్రాణాపాయస్థితికి గురికాకుండా భగవంతుడు రక్షించినందుకు ఉడతా భక్తిగా మానవతా సేవా దృక్పథంతో బెల్లంపల్లి లోని గంగారం నగర్ కు చెందిన చర్చిలో పేదవారికి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో దాతలు రాం కమల సత్యనారాయణ గారు మరియు బొద్దునసతీష్ పార్వతి, మమత, మహర్షీత్ బాలరాజు గార్లు పాల్గొనడం జరిగినది.
0 Comments