JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా అన్నదానం.బెల్లంపల్లి, తదితర చోట్ల సేవా కార్యక్రమాలు

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా అన్నదానం.బెల్లంపల్లి, తదితర చోట్ల సేవా కార్యక్రమాలు
న్యూస్ పవర్ రిపోర్టర్: సాయిరాం
బెల్లంపల్లి: ప్రపంచ మానవాళికి సర్వమతాలు సమానమని  బోధించిన సాయినాథుడి సంకల్పం మేరకు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి,  తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం చేపట్టారు. సాటి మనిషికి చేతనైనంత సాయం చేయాలని ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలని బోధించిన బాబా మాటలను నిజం చేస్తూ క్రిస్మస్ సందర్భంగా యాచకులకు, మానసిక వికలాంగులకు, అనాధలకు భోజనం  పంచిపెట్టారు. తమ కడుపు నింపిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే మార్గంగా అంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. ఆకలితో ఉన్న వారిని  అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తి పరిచామని పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బాబా బోధనలకు అనుగుణంగా అందరూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్నార్థులు, అనాధలకు సహాయం అందించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments