JSON Variables

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి :బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్

రామగుండము పోలీస్ కమీషనరేట్
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి :
బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్
న్యూస్ పవర్,27డిసెంబర్,రామగుండం:

ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్రంలో వేరియంట్ ను నియంత్రించడంలో భాగంగా  న్యూ ఇయర్ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.విధించిన ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోనబడుతాయని ఏసిపి గారు బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అనుసరించి వచ్చే నెల జనవరి 2వ తారీకు వరకు ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేదించబడటంతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో హజరయ్యేవారు తప్పని సరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాల్సి వుంటుంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బెల్లంపల్లి ఏసిపి గారు ప్రకటన తెలియజేసారు
👉నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఇంట ఆనందోత్సవాల నడుమ  నిర్వహించుకోవడంతో పాటు, జీరో యాక్సిడెంట్‌ డేకై బెల్లంపల్లి పోలీస్‌ సబ్ డివిజన్ పరిధిలో యువత మద్యం సేవించి నిర్లక్ష్య ధోరణితో వాహనాలను అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పాటు కోన్ని సందర్బాల్లో వాహనదారులతో పాటు సాధరణ ప్రజలు తీవ్ర గాయాలకు గురై ఆకాలంగా మరణిస్తున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై  సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించబడుతుందని  ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకై   ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది అని అన్నారు.
👉డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకెడ్లను ఏర్పాటు చేయబడుతాయని తెలిపారు.

👉ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల నడుమ సంతోషాలతో నిర్వహించుకోవాలని, రాబోవు కోత్త సంవత్సరంలో ప్రజలు తాము నిర్థేషించుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలకు నేలవు కావాలని ఆకాంక్షిస్తూ ఏసీపీ గారు తెలిపారు.

 ఈ పత్రికా సమావేశంలో ఏసీపీ గారితో పాటు  బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రాజు బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ జగదీష్ పాల్గొన్నారు

Post a Comment

0 Comments