JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా పెద్దనపల్లి రైల్వే స్టేషన్ వాస్తవ్యులు సామల రాహుల్ మరియు రాగసుధ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి తండ్రి సామల లక్ష్మణ్ స్వాతి గారి సహకారంతో వారిచేతనే మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి లో అమ్మ శరణాలయంలో మరియు యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు పేదవారికి అన్నదానం మరియు అరటి పండ్లు  పంచడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. 

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు . అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments