బిఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురాడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి
ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు వెల్జీపూర్,
ఎర్రనర్సుపల్లి,రహీంఖాంపేట,ఆనంతారం
గ్రామాలలోని అందుబాటులో ఉన్న ఉద్యమకారులను ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ ఆత్మీయ పలకరింపులో భాగంగా నేడు వారి స్వగృహాలకు వెళ్లి యోగ క్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు,
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను గురించి జనాలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తద్వారా బిఆర్ఎస్ పార్టీ ని మూడోసారి అధికారంలోకి తీసుకురాడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఉద్యమకారులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది,ఇంటికి వెళ్లి ప్రతి ఉద్యమ కారుడిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఒక్క పిలుపు కి నన్ను నమ్మి నాతో వచ్చి తిన్న,తినకున్న తెలంగాణ కోసం అహర్నిశలు తనతోపాటు కష్టపడ్డ ప్రతీఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఆనాడు ఉద్యమసమయంలో ఆంద్రపాలకుల చేతిలో అక్రమ కేసులకై గురై తనతో పాటు జైలు జీవితాన్ని గడిపిన తెలంగాణ ఉద్యమకారుడు అవారి బాలయ్య ఇంటికి వెళ్లి వారిని ఘనంగా శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు ,సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు,దళిత సంఘాల నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
0 Comments