సన్నాహక సమావేశంలో పాల్గొన్న వోరగంటి
ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వములో జరిగిన దళిత బహుజన సంఘాల నాయకుల సభలో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా నగరమైన హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు దళిత బహుజనుల పక్షాన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపడానికి మే 13 తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది,ఈ సభను ఉద్దేశించి మరియు కార్యక్రమ నిర్వహణ సన్నాహక సమావేశాలను గురించి మంత్రి గారి సమక్షంలో చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,దళిత సంఘాల నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments