JSON Variables

రైతులు దళారుల నుండి ఎవరు మోసపొవద్దు

రైతులు దళారుల నుండి ఎవరు మోసపొవద్దు

 న్యూస్ పవర్ , 21 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని ఇల్లంతకుంట,జంగంరెడ్డి పల్లె,అనంతారం,పెద్దలింగాపూర్ గ్రామాలలో  వడ్ల కొనుగోలు  సెంటర్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్,మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్ అనంతరం రసమయి  మాట్లాడుతూ  రైతులు దళారుల నుండి ఎవరు మోసపొవద్దన్నారు , ప్రతి గింజ మేమే కొంటామని మిల్లర్లు ఇబ్బంది పెడుతె నేరుగ నాకు గాని అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయలన్నారు , రైతులేనిదే రాజ్యం లేదు, రైతు కన్నీరు పెడితే రాజ్యం కన్నీరు పెడుతది..కేంద్రానికి పుట్టగతులుండవు అని అన్నారు,రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వం నిలువలేదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు, తెలంగాణ లో  సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాల బీడుభూములకు సాగు నీరందిస్తున్నారని, తెలంగాణ లోని పచ్చటి పంట పొలాలను చూసి మోడీ సర్కారు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతోందని అన్నారు, 
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు , ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి , వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, పాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ , బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు రైతులు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments