JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆహారం పంపిణీ


న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో
 బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్  ద్వారా బెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీ నవల్ సోనీ ట్రస్ట్ నిత్య దాత గారి పుట్టినరోజు సందర్భంగా   అన్నదానం పంచినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని గురువారం మధ్యాహ్నం పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు, అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ.వారికి సేవ ట్రస్ట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు మోటపలుకుల తిరుపతి, కొడిమాల సంతోష్ దుర్గం మారుతీ మధు, ప్రేమ్ మరియు సేవకులు పాల్గొన్నారు. సంప్రదించడానికి ట్రస్ట్ మేనేజర్- 8106550532
ట్రస్ట్ ఫౌండర్స్ 9959269975

Post a Comment

0 Comments