JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి-శంకర్ పదకొండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని పలు చోట్ల యాచకులకు మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పండ్లు, బ్రెడ్డు, మధ్యాహ్న భోజనాన్ని అందుకున్నవారు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులైన కాంపల్లి రాజేశ్వరి-శంకర్ దంపతులకు సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రస్టు వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు, ట్రస్టు సభ్యులు సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments