న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం
మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో
బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీ బొడ్డు గోపాలకృష్ణ విజయ గారి కుమారుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో వారిచేతనే సోమవారం రాత్రి అన్నదానం పంచినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు, అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు మరియు సేవకులు పాల్గొన్నారు. సంప్రదించడానికి ట్రస్ట్ మేనేజర్- 8106550532
ట్రస్ట్ ఫౌండర్స్ 9959269975
0 Comments