JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లి పట్టణంలో: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా బెల్లంపల్లి వాస్తవ్యులు సాయి జిరాక్స్ ఏకిరాల రమేష్ శోభ గారి కుమారుడు ఏకిరాల సాయిరాం గారి పుట్టినరోజు సందర్భంగా వారి  తండ్రి రమేష్ గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో  మంగళవారం మధ్యాహ్నం బెల్లంపల్లి లో యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు మరియు పేదవారికి అన్నదానం   పంచడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. *బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్* ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం* అని పిలుపునిచ్చారు మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు . అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments