JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
NEWSPOWER REPORTER:Sairam
 బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు.  అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు, సేవకులుపాల్గొన్నారు.

Post a Comment

0 Comments