అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి
న్యూస్ పవర్ , 24 ఆగస్టు , ఇల్లంతకుంట :
అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలనీ సామాజిక ఉద్యమ కారుడు,తెలంగాణ అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ అన్నారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి,ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ లకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు,రాహుల్ గాంధీ ,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్థం పథకం కింద రూ" 12 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించి, ప్రభుత్వం ఏర్పడి రెండు గడుస్తున్నా నేటికీ అమలు చేయకపోవడం అంబేద్కర్ ని అవమానపరచడమే అన్నారు,చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని అన్నారు,అంబేద్కర్ ఆయహస్థం వెంటనే అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాల ప్రజలను ఏకం చేసి మానకొండూర్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడానికి కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
Comments
Post a Comment